
కొంతమంది హీరోయిన్స్.. ఇలా వస్తారు.. అలా ఇంప్రెస్ చేస్తారు.. ఆడియెన్స్ మనసుల్లో తమ మార్క్ వేస్తారు. అంతలోనే కనిపించకుండా మాయమైపోతారు. అందం, అభినయం ఉన్నప్పటికీ.. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి బ్రతుకుతుంటారు. ఆ కోవకే చెందిన ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అక్కినేని అందగాడు నాగార్జున.. రొమాంటిక్ పాత్రలో నటించిన మన్మథుడు సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీకి త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందిచారు. నాగర్జున కెరీర్లో ఈ మూవీ ఓ క్లాసిక్. ఇప్పడు టీవీలో ప్రసారమవుతున్నా కూడా వీక్షకులు అలా సినిమాలో లీనమైపోతుంటారు. కాగా ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు అంబానీ… ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఆ ఇద్దరితోనూ నాగార్జున లవ్ ట్రాక్స్ చాలా బ్యూటీఫుల్గా ఉంటాయి.
మెయిన్గా చెప్పాలంటే.. అన్షు పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా చూశాక కూడా ఆమె పాత్ర ఆడియెన్స్ను వెంటాడుతూ ఉంటుంది. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది అన్షు. ఈ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్తో రాఘవేంద్రలో యాక్ట్ చేసింది. అయితే యాధృచ్చికంగా ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె మరణించే పాత్రలే చేసింది. ఇక నీలకంఠ తీసిన మిస్సమ్మ మూవీలోనూ ఓ గెస్ట్ రోల్లో మెరిసింది. చాలా తక్కువ మూవీస్ చేసిన అన్షు.. లండన్ వెళ్లిపోయి.. అక్కడే సెటిలైపోయింది. అక్కడే పుట్టి పెరిగిన ఈ నటి.. సినిమా పరిశ్రమకు కూడా ఓ అతిథిలా వచ్చి వెళ్లింది. లండన్లోనే వ్యాపారవేత్త సచిన్ సగ్గార్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ఈమె లండన్లో ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ రన్ చేస్తుంది. సినిమాల్లో నటించి 20 ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఆమె అంతే చెక్కుచెదరని అందంతో ఉంది.
అన్షు ఫిల్మ్ ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ అవ్వనున్నట్లు మొన్నామధ్య రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అయితే అన్షు సన్నిహితులు మాత్రం ఇవి గాలి వార్తలని కొట్టి పారేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.