ఇదెక్కడి మేకోవర్ మావ..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.! రాజుగారి గది సినిమాలో ఈ బ్యూటీ గుర్తుందా.?

రాజు గారి గది సినిమా 2015లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఓంకార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా రాజు గారి గది సిరీస్‌లో మొదటిది, వరాహి చలన చిత్రం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మితమైంది.

ఇదెక్కడి మేకోవర్ మావ..! స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా.! రాజుగారి గది సినిమాలో ఈ బ్యూటీ గుర్తుందా.?
Raju Gari Gadhi

Updated on: May 05, 2025 | 8:23 PM

ఓంకార్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెలివిజన్ షోస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఓంకార్. ఆయన హోస్ట్ గా ఎన్నో షోలను నిర్వహించి ప్రేక్షకులను మెప్పించారు. యాంకర్ గా రాణిస్తూనే దర్శకుడిగానూ తన ప్రతిభ చాటుకున్నారు ఓంకార్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా రాజుగారి గది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా హారర్ కామెడి నేపథ్యంలో తెరకెక్కింది. 2015లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ధనరాజ్, షకలక శంకర్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అలాగే ఈ సినిమా హీరోయిన్స్ గా ధన్య బాలకృష్ణ నటించింది. ఆమె తో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో అలరించింది.

ఆమె పేరు ఈశాన్య మహేశ్వరి ఈ అమ్మడు రాజుగారి గది సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ముంబై కు చెందిన ఈ చిన్నది మోడలింగ్ చేసి ఆపై హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత నమస్తే నమస్తే సినిమాలో చేసింది.. రాజుగారి గది సినిమా హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో హిందీలో పలు సినిమాలు చేసింది

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈశాన్య మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడాని నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి