
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన తమిళనాడు రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లను గెల్చుకున్న టీవీకే పార్టీ అధికారం చేపట్టనుంది. హీరో విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు విజయ్ కు 120 ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తానికి ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్న నటుడిగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే విజయ్తో పాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఒకే ఒక నటి ఎవరో తెలుసా? తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్తో ఆమె నటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక రేపో, ఎల్లుండో ముఖ్యమంత్ర పీఠం ఎక్కబోతున్న విజయ్ తోనూ కలిసి యాక్ట్ చేశారు. తద్వారా ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటిగా ఆమె రికార్డు అందుకుంది. అన్నట్లు ఆ దిగ్గజ నటి మన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?
నాటకాలతో మొదలు పెట్టి సుమారు 1000కు పైగా సినిమాల్లో నటించిన మనోరమ గురించి మన తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమా కెరీర్ లో మూడు తరాల నటులతో కలిసి నటించిన ఆమెఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. అంతేకాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు.
కాగా ఈ దిగ్గజ నటి 2015 అక్టోబర్ లో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు.
Aachi Manorama