Tollywood: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..

|

Oct 13, 2024 | 4:56 PM

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూజా హెగ్డే. అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు.. దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది

Tollywood: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..
Tollywood
Follow us on

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూజా హెగ్డే. అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు.. దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. డీజే, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. అప్పట్లో స్టార్ హీరో సినిమా అంటే చాలు.. హీరోయిన్‌గా పూజా హెగ్డేనే కన్ఫర్మ్ అయ్యేది. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. అనూహ్యంగా కనుమరుగైంది. రాధే శ్యాం, ఆచార్య. బీస్ట్, కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలు మూటగట్టుకుంది ఈ వయ్యారి. దీంతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఒక్కసారిగా పూజా హెగ్డేను పక్కనపెట్టేశాయి. పైగా మొదటిగా గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికవ్వడం.. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో.. ఈ ఏడాది మరే చిత్రంలోనూ నటించలేదు పూజా హెగ్డే.

ఇవి కూడా చదవండి

అయితేనేం బంతి ఎంత గట్టిగా కొడితే.. అంత వేగంగా తిరిగొస్తుందన్నట్టు.. పూజా బౌన్స్ బ్యాక్ అయింది. ఇటీవల మూడు బడా ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది బుట్టబొమ్మ. హిందీలో షాహీద్ కపూర్ సరసన ‘దేవ’ అనే చిత్రంలో, అలాగే తమిళంలో సూర్యతో ఒక చిత్రం, దళపతి విజయ్ చివరి మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూజా.. నిత్యం హాట్ ఫోటోషూట్స్, వెకేషన్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇవాళ పూజా హెగ్డే తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి