
ప్రపంచంలో అత్యధికులు సందర్శించే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్ కూడా ఒకటి. ముఖ్యంగా ఇక్కడి బుర్జ్ ఖలీఫా భవనమంటే తెలియని వారు ఉండరు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా దుబాయ్ కు వెళితే ఈ బుర్జ్ ఖలీఫాను సందర్శించాల్సిందే. భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే.
అయితే ఇప్పుడు ఈ ఆకాశ సౌధాన్ని అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. అందుకే పలువురు కోటీశ్వరులు, వ్యాపార వేత్తలు, సినిమా సెలబ్రిటీలు కోట్లు కుమ్మరించి ఇక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇందులో మన దేశానికి చెందిన సినీ ప్రముఖలు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మలయాళ సూపర్ స్టార మోహన్ లాల్ ఈ బుర్జ్ ఖలీఫాలో సింగిల్ బెడ్ రూమ్ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే దీనిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు మోహన్ లాల్. అయితే ఈ బుర్జ్ ఖలీపాలో మరొక ఇండియన్ సెలబ్రిటీ కూడా ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి.
శిల్పా శెట్టి ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాజ్ కుంద్రా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్ను తన సతీమణికి గిఫ్ట్గా ఇచ్చాడు. శిల్పాశెట్టి ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. దీని విలువ సుమారు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మోహన్ లాల్, శిల్పా శెట్టితో పాటు పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్ బుర్జ్ ఖలీఫా భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు అని ముద్దుగా పిలుస్తారట. ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే.. మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలకు కూడా దుబాయిలో అపార్ట్మెంట్స్ ఉన్నాయని ప్రచారంలో ఉంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు.
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. ఈ టవర్లో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ధర కనీసం రూ. 7 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. 2 బెడ్రూమ్ యూనిట్ ధర కనీసం రూ. 10.8 కోట్లు ఉంటుంది. ఈ భవనంలో అల్ట్రా-లగ్జరీ అపార్ట్ మెంట్ల ధరలు రూ. 20–22 కోట్లకు పైడా పలుకుతాయని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..