ప్ర‌భాస్ ప‌క్క‌న దీపికా…ఫైన‌ల్ అయిపోయిన‌ట్టేగా..!

|

May 30, 2020 | 9:05 PM

‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ ఇంట‌ర్నేష‌న్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌డి సినిమాల‌పై భారీ ఎత్తున అంచ‌నాలు పెరిగిపోయాయి. ‘బాహుబలి’ అనంత‌రం ‘సాహో’ మూవీ చేసిన ప్ర‌భాస్..ప్ర‌స్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంట‌నే..అగ్ర నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ చిత్రం నిర్మించనున్నట్టు అనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఈ […]

ప్ర‌భాస్ ప‌క్క‌న దీపికా...ఫైన‌ల్ అయిపోయిన‌ట్టేగా..!
Follow us on

‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ ఇంట‌ర్నేష‌న్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌డి సినిమాల‌పై భారీ ఎత్తున అంచ‌నాలు పెరిగిపోయాయి. ‘బాహుబలి’ అనంత‌రం ‘సాహో’ మూవీ చేసిన ప్ర‌భాస్..ప్ర‌స్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంట‌నే..అగ్ర నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ చిత్రం నిర్మించనున్నట్టు అనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఈ మూవీలో ప్రభాస్ పక్కన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటింనుందని ఇండ‌స్ట్రీలో టాక్ జోరందుకుంది. ఇప్ప‌టికే నాగ్ అశ్విన్..దీపికాకు క‌థ చెప్పిగా..ఆమె గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తూ..దీపికా శ‌నివారం మ‌హానటి సినిమా వెంట‌నే చూడ‌మంటూ ఫ్యాన్స్ కు కోరింది. దానికి ఆ చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వేకూవ‌జామున కూల్ పోస్ట్ చూశానంటూ రిప్లై ఇచ్చారు. వీట‌న్నింటినీ గ‌మ‌నించిన సినీ జనాలు..మూవీలో హీరోయిన్ గా దీపికా క‌న్ఫామ్ అంటూ జోతిష్యం చెబుతున్నారు.