Abhiram Daggubati : దగ్గుబాటి కుర్ర హీరో ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్నాడా..?
తమిళ్ లో సూపర్ హిట్ అయినా మనాడు సినిమా తెలుగులో రీమేక్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. హీరో శింబు నటించిన మానాడు సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అవ్వనుందని తెలుస్తుంది.
Abhiram Daggubati : తమిళ్ లో సూపర్ హిట్ అయిన మనాడు సినిమా తెలుగులో రీమేక్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. హీరో శింబు నటించిన మానాడు సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అవ్వనుందని తెలుస్తుంది. ఎస్.ఎస్.ఐ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. తమిళంలో పోయిన ఏడాది నవంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హీరోకి .. విలన్ కి మధ్య మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా కేవలం తమిళ్ లోనే రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ బ్యానర్ సరేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాను దగ్గుబాటి హీరో రానా తో రీమేక్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆతర్వాత మాస్ రాజా రవితేజ పేరు వినిపించింది. కనే ఇప్పుడు మరో హీరో పేరు తేరా పైకి వచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న విషయం తెలిసిందే. రానా సోదరుడు అభిరామ్ హీరోగా త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే ‘మానాడు’ రీమేక్ మొదలవుతుందని అంటున్నారు.ఇక ఈ సినిమాకు తెలుగులో ది లూప్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :