బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున చెప్పే పేరు రాఖీ సావంత్. ఈ అమ్మడు చాలా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. నిత్యం ఎదో ఒక రచ్చ చేసి వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. తాజాగా రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరింది. ఆమె హార్ట్ ప్రాబ్లెమ్ తో బాధపడుతుందని తెలుస్తోంది. గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేసింది రాఖీ సావంత్. దీని గురించి ఓ ఫోటోగ్రాఫర్ కు రాఖీ సావంత్ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే నిజంగానే రాఖీ సావంత్ ఆరోగ్యం క్షీణించిందా..? లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందా.? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఒక చేతిలో ఆక్సిమీటర్ అలాగే మరో చేతిలో BP మెషీన్తో మంచంపై పడుకున్న రాఖీ ఫోటోను ఓ కెమెరామ్యాన్ పంచుకున్నారు. రాఖీకి హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని, ట్రీట్ మెంట్ తీసుకుంటోందని ఆ ఫోటోగ్రాఫర్ పోస్ట్ చేశాడు. రాఖీ మాజీ భర్త మీడియాతో మాట్లాడుతూ, రాఖీ ఆరోగ్య సమస్యపై తనకు ఎలాంటి సమాచారం లేదని, అయితే సమాచారం అందిన వెంటనే తెలియజేస్తానని చెప్పారు.
రాఖీ మాజీ భర్త, మైసూర్కు చెందిన ఆదిల్, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పంచుకున్నాడు. అలాగే ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని రాశాడు. రాఖీ సావంత్కు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు, రాఖీ సావంత్ నాలుగు వారాల్లోగా ముంబై పోలీసులకు లొంగిపోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల వల్లే రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరిందా అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. నెటిజన్స్ కూడా రాఖీ నాటకం ఆడుతుందని అంటున్నారు. గతంలో పూనమ్ పాండే కూడా చనిపోయినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తేనే రాఖీ సావంత్ బెయిల్ దరఖాస్తును కోర్టు స్వీకరిస్తామని, లేకుంటే అప్పటి వరకు బెయిల్ ఉండదని ఆదిల్ దురానీ అన్నారు. మైసూరుకు చెందిన ఆదిల్, రాఖీ సావంత్లు వివాహం చేసుకున్నారు. అయితే రాఖీ సావంత్ ఆదిల్పై అనేక ఆరోపణలు చేసింది. రాఖీ ఫిర్యాదు ఆధారంగా ఆదిల్ను అరెస్టు చేశారు. ఆదిల్ ఇప్పుడు రాఖీపై ఫిర్యాదు చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.