కౌశల్ మందా..తెలుగు బిగ్ బాస్ 2 టైటిల్ గెలవడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్గా మారాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజాధారణ అందుకున్న కౌశల్..ఆ తర్వాత అదే స్థాయిలో వివాదాలకు కూడా దగ్గరయ్యాడు. ఇకపోతే ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు ఈ బుల్లితెర కమ్ వెండితెర నటుడు. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు.
ఆ వెంటనే ఫ్యామిలీ టూర్ ఫ్లాన్ చేసిన కౌశల్ ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఆ ప్రాంతానికి సంబంధించిన వేషధారణతో బిగ్ బాస్ విన్నర్ కుటుంబ సభ్యులు చెక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలను కౌశల్ ఆర్మీ తెగ వైరల్ చేస్తోంది. కాగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన సీరియల్స్తోనే కౌశల్ బిజీగా ఉన్నాడు. మంచి స్కిప్ట్ దొరికితే హీరోగా చెయ్యాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.