
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన తాజా చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల తెరకెక్కిచిన ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన గరుడన్ సినిమాకు రీమేక్ ఇది. ఒరిజినల్ ఛాయలు కనిపిస్తున్నా.. తెలుగు ఆడియన్స్ కోసం భారీగానే మార్పులు చేసినట్లు అర్థమవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ మూవీ చాలా కీలకం. అందుకు తగ్గట్టుగానే టీజర్స్, పోస్టర్స్ , ట్రైలర్ అద్బుతంగా వచ్చాయి. ఇది వీరికి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈ సినిమాపై ‘బాయ్ కాట్’ ట్రెండ్ ప్రారంభమైంది. మొదట మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సీపీ అభిమానులు ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కనక మేడల చేసిన కొన్ని కామెంట్స్ దీనికి కారణం. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటున్నారు. డైరెక్టర్ 2011లో చిరంజీవి, రామ్ చరణ్ ల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని మెగాభిమానులు మండిపడుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్ )లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.
‘నమస్కారం .. అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ.. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను’ అని రాసుకొచ్చారు. మరి దీంతోనైనా మెగాభిమానులు కూల్ అవుతారో లేదో చూడాలి.
నమస్కారం
అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…
— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..