ప్రభాస్-అనుష్కల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నిజ జీవితంలోనూ వీరిద్దరి మధ్య మంచి బంధం ఉంది. అనుష్క తనకు మంచి ఫ్రెండ్ అని ప్రభాస్ చాలాసార్లు చెప్పాడు. ఇక ప్రభాస్-అనుష్కల గురించి వచ్చిన రూమర్స్ అన్నీ, ఇన్నీ కాదు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. 40 ఏళ్లొచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అనుష్కకు కూడా ప్రస్తుతం 38 సంవత్సరాలు. ఇద్దరూ పెళ్లి ఊసెత్తకపోవడంతో వార్తలు రాసేవారికి కూడా మంచి కంటెంట్ దొరకుంతుంది. అయితే పెళ్లి విషయాన్ని వారి వద్ద ప్రస్తావించినపుడు మాత్రం ఏమీ లేదని కొట్టిపారేస్తారు. లేదంటే సమాధానం దాటవేస్తారు. ( రైతులకు అలెర్ట్ : పీఎం కిసాన్ స్కీమ్ డబ్బు పడకపోతే ఇలా చేయండి ! )
తాజాగా మరోసారి అనుష్క.. ప్రభాస్తో పెళ్లి గురించి పరోక్షంగా స్పందించాల్సిన సందర్బం వచ్చింది. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండే ఆమె.. తన కొత్త చిత్రం నిశ్శబ్దం విడుదల నేపథ్యంలో ట్విట్టర్ ఖాతాను తెరిచి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా మిర్చి సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్, అనుష్క పెళ్లి బట్టల్లో తయారై పీటలపై కూర్చున్న ఫొటో ఒకటి షేర్ చేస్తూ ఓ ఫ్యాన్ దీని గురించి స్పందించాలని అనుష్కను కోరాడు. ఐతే ఆ ఫ్యాన్ అడిగిన కోణం ఒకటి అయితే, అనుష్క మరో యాంగిల్లో సమాధానం చెప్పింది. ఒక సీన్ షూటింగ్ సందర్భంగా ఇద్దరం మాట్లాడుకుంటుంటే తీసిన క్యాండిడ్ పిక్ అని.. ఇది తన మనసుకు దగ్గరైన ఫోటో అని.. యువి క్రియేషన్స్ వాళ్ల తొలి సినిమా అని పేర్కొని.. యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్కీల పేర్లు ప్రస్తావించి దండం పెట్టే ఎమోజీలు పెట్టింది. ఈ ఆన్సర్ చూశాక అనుష్క మరోసారి ప్రభాస్తో రిలేషన్ గురించి ఏమీ మాట్లాడకుండా అనుష్క తెలివిగా తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ( శ్రీవారి భక్తులకు శుభవార్త, దర్శనం టికెట్ల అదనపు కోటా విడుదల )