పనికొచ్చే వాటిపై దృష్టిపెట్టండి.. ఛాలెంజ్‌లపై కాకుండా..!

| Edited By:

Jul 05, 2019 | 7:30 AM

పనికొచ్చేవాటిపై దృష్టి పెట్టండి.. అంటూ యాంకర్ రష్మి సీరియస్ అయ్యింది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి. అందరూ ఆ ఛాలెంజ్‌ని చేస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్‌ చేసేవారు. కాగా.. తాజాగా ‘బాటిల్ క్యాప్’ అనే కొత్త ఛాలెంజ్ వచ్చింది. దీన్ని ఒకరునొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటూ సెలబ్రిటీల వరకూ పాకింది. అయితే.. ఈ వీడియోలు చూసిన రష్మీకి చాలా కోపం వచ్చిందట. ఇలాంటి చెత్త ఛాలెంజ్‌లు […]

పనికొచ్చే వాటిపై దృష్టిపెట్టండి.. ఛాలెంజ్‌లపై కాకుండా..!
Follow us on

పనికొచ్చేవాటిపై దృష్టి పెట్టండి.. అంటూ యాంకర్ రష్మి సీరియస్ అయ్యింది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి. అందరూ ఆ ఛాలెంజ్‌ని చేస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలు అప్‌లోడ్‌ చేసేవారు. కాగా.. తాజాగా ‘బాటిల్ క్యాప్’ అనే కొత్త ఛాలెంజ్ వచ్చింది. దీన్ని ఒకరునొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటూ సెలబ్రిటీల వరకూ పాకింది.

అయితే.. ఈ వీడియోలు చూసిన రష్మీకి చాలా కోపం వచ్చిందట. ఇలాంటి చెత్త ఛాలెంజ్‌లు చేసి టైమ్ వేస్ట్ చేసుకునేకంటే.. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిపై దృష్టి పెట్టాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న పిల్లలపై అత్యాచారాలు, వాటర్ ప్రాబ్లమ్స్, రైతుల ఆత్మహత్యలు, పొల్యూషన్ ఇలాంటి వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని వాటిని పరిష్కరించే దిశాగా చేయ్యవచ్చు కదా..! అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది.