
తమిళ్ స్టార్ హీరో అజిత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మోహిని శనివారం ( మే30న )కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మోహిని.. చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు అజిత్.
అజిత్ తల్లి మరణవార్త విని అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అజిత్ సికింద్రాబాద్ లోజన్మించారు. తనకి చిన్నప్పుడూ తమిళ్ రాదు అయిన్నప్పటీకి సినిమా హిరోగా తమిళ హిరోగా తమిళ్ లో మంచి పేరు తెచ్చుకునాడు.