
రెజీనా కాసాండ్రా.. ఈ అందాల భామ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెజీనా, 2005లో తమిళ చిత్రం “కండా నాల్ ముదల్”తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తెలుగులో “శివ మనసులో శృతి” (2012) ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు “సైమా ఉత్తమ తొలి చిత్ర నటి” అవార్డు కూడా వచ్చింది.
రెజీనా తెలుగులో “రొటీన్ లవ్ స్టోరీ”, “పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పవర్” వంటి సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో “కేడి బిల్లా కిల్లాడి రంగా”, “మానగరం” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు పొందింది.ఈ బ్యూటీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”లో సాంప్రదాయ అమ్మాయి, “జ్యో అచ్యుతానంద”లో స్టూడెంట్, “అ”లో డ్రగ్ అడిక్ట్ వంటి పాత్రల్లో తన సత్తా చాటింది.
ఈ భామ బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. 2019లో “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” చిత్రంతో హిందీలో ప్రవేశించింది. తాజాగా విడుదలైన సన్నీ డియోల్ “జాట్” చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అలాగే, వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతుంది. తాజాగా రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన “అ” సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తా.. లేదా ఏదైనా కీలకమైన , నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇస్తే చేస్తా అని చెప్పిందట.. అయితే హీరోయిన్ గా ఇప్పటికే కాజల్ ను ఫిక్స్ చేశాం అని చెప్పారు. సరే మరో బలమైన పాత్ర ఇవ్వమని అడిగాను. లేదంటే సినిమా చేయను అని తెగేసి చెప్పా అని తేలింది. దాంతో మీరా అనే పాత్ర ఇచ్చినట్టు తెలిపింది రెజీనా. అలాగే రీసెంట్ గా వచ్చిన జాట్ సినిమాలోనూ పోలీస్ ఆఫిసర్ పాత్ర చేయమన్నారు. నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను అని చెప్పా దాంతో నాకు ఆ పాత్ర ఇచ్చారు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి