Rashi Khanna: పక్కా కమర్షియల్ ట్రైలర్ లాంచ్లో రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హీరోయిన్ కాదంటూ..
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ... యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మ్యాచో హీరో గోపిచంద్ (Gopichand) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్ (Pakka Commercial). సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లకు అనూహ్య స్పందన లభించింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 … యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం పక్కా కమర్షియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇదే వేదికపై గోపిచంద్ బర్త్ డే సెలబ్రెషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు.. కమెడియన్.. మొదటిసారి నేను కామెడీ రోల్ చేశాను.. అంతగా ఆ పాత్ర నవ్విస్తుంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. ” అంటూ చెప్పుకొచ్చింది.. అలాగే డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి గోపిచంద్ గారు ఒప్పుకున్న తర్వాత ఆయనను మరింత బాగా చూపించాలనే విషయంపై ఏకాగ్రత పెట్టాను.. అందుకు తగినట్టుగానే గోపిచంద్ ఎఫర్ట్స్ పెట్టారు.. ఆయన అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది.. ఇంత మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి.. వంశీ, వాసులకు ధన్యవాదాలు అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.