
హీరోయిన్ రంభ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రంభ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్లో తన గ్లామర్, అద్భుతమైన నటనతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన కథానాయిక రంభ. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న రంభ.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమయ్యారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో రంభ తన సినీ ప్రయాణం, వివాహ జీవితం మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్లో దాదాపు అందరు అగ్ర నటులతో పనిచేశానని, తనకు ఏ ఒక్కరూ ప్రత్యేకంగా ఇష్టమైన వారని ఏమీ లేదని, అందరితో సమానంగా మరియు ఎంతో సంతోషంగా పనిచేశానని ఆమె పేర్కొన్నారు.
ఈ తరం స్టార్ హీరోలలో ఎవరితో నటించాలని ఉంది అనే ప్రశ్నకు రంభ ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లతో నటించాలని తనకు ఎప్పటి నుంచో బలమైన కోరిక ఉందని ఆమె వెల్లడించారు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, హ్యాండ్సమ్నెస్ అలాగే ప్రభాస్ ప్యాన్ ఇండియా ఇమేజ్, వారి అద్భుతమైన నటన తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. సరైన కథ , మంచి పాత్ర లభిస్తే వీరిద్దరితో స్క్రీన్ పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రంభ తెలిపారు.
ఒకవేళ రంభ మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు లేదా ప్రభాస్ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తే, అది వెండితెరపై ఒక అద్భుతమైన ఫీస్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. కోలీవుడ్ బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
Prabhas, Mahesh Babu
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..