Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..

| Edited By: Anil kumar poka

Dec 16, 2021 | 12:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. మొదటిసారి బన్నీ పూర్తిగా డీగ్లామర్

Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..
Samantha Song
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. మొదటిసారి బన్నీ పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించబోతుండడంతో ఆయన ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ఐటెం సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన కొద్ది గంటల్లోనే నెట్టింట్లో రికార్డ్స్ సృష్టించింది ఈ సాంగ్. సమంత స్టెప్పులు.. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్‏కు శ్రోతలకు కిక్కి్చ్చింది. ఊ అంటావా మావ.. ఉహు ఉహు అంటావా అంటూ సాగే ఈ పాట యూత్‏ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది.

అయితే నెట్టింట్లో ఈ పాట ఎంత రెంజ్‏లో దూసుకుపోతుందో.. అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ పాటలో వాడిన పదాలు పురుషుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని.. మగవాళ్లందరూ కామంతో ఉంటారనే అర్థం వచ్చేలా పాట ఉందని.. వెంటనే ఆ పాటను సినిమా నుంచి తీసేయంటూ ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది ఏపీ పురుషుల సంఘం. చిత్రయూనిట్‏తోపాటు.. పాటలో నటించిన సమంతపై కూడా కేసు పెట్టింది పురుషుల సంఘం. తాజాగా సమంత ఐటెం సాంగ్ ఇష్య్యూ పై నటి మాధవిలత తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంచలన కామెంట్స్ చేసింది.

తన ఫేస్ బుక్ ఖాతాలో మాధవిలత.. ” వాయమ్మో.. పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా.. ఈ లెక్కన ఇండస్ట్రీలో 90% సాంగ్స్ అలాగే ఉంటాయి. సాంగ్స్ లేని సినిమాలు చేయాలి. అయితే నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకు కేసులు పడతా.. రారా సామి సాంగ్ మీద.. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పోలిస్తే అంత చులకనగా వెంట పడి వెళ్లిపోద్దా ? అబ్బాయి నడిచిన చోట భూమిని టచ్ చేసి మొక్కుతుదా… ఒక మహిళ పరువు పోయింది. ఛ.. నాకు నచ్చలే.. నేను పెడతా కేసు.. అంతే తగ్గేదేలే..” అంటూ పోస్ట్ చేసింది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ కమ్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..

Sara Ali Khan: నేనూ తప్పులు చేశాను.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ గురించి పట్టించుకోను.. సారా ఆసక్తికర వ్యాఖ్యలు..

YouGov survey 2021: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించే పురుషుల జాబితాలో ప్రధాని మోడీ, విరాట్ కోహ్లీ.. మహిళల్లో ప్రియాంక చోప్రా