
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ తోపాటు.. గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికీ దాడులు ఆగడం లేదు.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం యుద్ధం జరుగుతుండగా దుబాయ్ లో ఉన్న ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఇప్పటికే చాలా మంది దుబాయ్ లో ఇరుక్కుపోయారు. పలువురు సినీ సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా దుబాయ్ లో చిక్కుకున్నారు.
ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు దుబాయ్ లో చిక్కుకున్నామని దయచేసి తమను రక్షించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కాగా దుబాయ్లో ఉన్నవారికి సాయం చేస్తానని నటుడు సోనూసూద్ ముందుకొచ్చారు. యుద్ధం కారణంగా దుబాయ్లో చిక్కుకున్నవారికోసం సాయం చేస్తానని ప్రకటించారు సోనూసూద్. ఏ దేశస్థులైనా పర్వాలేదని తాను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని సోనూసూద్ తెలిపారు.
వారి వారి దేశాలకు చేరుకునేవరకు.. దుబాయ్లో వసతి కల్పిస్తానన్న సోనూసూద్ తెలిపారు. ఉచితంగా వసతిని కల్పిస్తానంటూ ప్రకటించారు సోనూసూద్. సాయం కావాల్సిన వాళ్లు ఇన్స్టా ద్వారా సంప్రదించాలని అన్నారు సోనూ.. అలాగే ఇన్స్టా ద్వారా సంప్రదించిన వారికి తన టీమ్ సాయం చేస్తుందని.. నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ అంటూ ఇన్స్టా వేదికగా ప్రకటించారు సోనూసూద్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.