Nikhil Siddharth: చెప్పు తెగుద్ది.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ హీరో

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆఘ్గనిస్థాన్‌ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా ఆఫ్గాన్‌లో జరుగుతోన్న పరిణామాలపైనే చర్చ జరుగుతోంది. ఇక ప్రతి రోజూ ఆ దేశానికి సంబంధించిన వార్తలు...

Nikhil Siddharth: చెప్పు తెగుద్ది.. అమెరికా అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ హీరో

Updated on: Aug 26, 2021 | 11:37 AM

Comments On Joe Biden: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆఘ్గనిస్థాన్‌ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా ఆఫ్గాన్‌లో జరుగుతోన్న పరిణామాలపైనే చర్చిస్తున్నారు. ఇక ప్రతి రోజూ ఆ దేశానికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆఘ్గనిస్థాన్‌ మళ్లీ తాలిబన్ల వషం కావడానికి అమెరికానే కారణమని కొందరు వాదిస్తున్నారు. అమెరికా వైఫల్యమే దీనికి కారణమని పలువురు నిపుణులు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉన్నపలంగా అమెరికా దళాలు ఆఫ్గాన్‌ను వదిలి వెళ్లడం వల్లే తాలిబన్లు ఇంతలా రెచ్చిపోతున్నారనే వాదన తెరపైకి వచ్చింది.

 

ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయమై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ కూడా స్పందించాడు. దేశంలో భారీగా పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలపై స్పందిస్తూ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన నిఖిల్‌ ఈసారి అమెరికా అధ్యక్షుడినే టార్గెట్‌ చేశాడు. అమెరికా వల్లే ఆఫ్గాన్‌లో ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న అర్థంలో.. నిఖిల్‌ కాంట్రవర్సీ ట్వీట్ చేశాడు. ఈ విషయమై నిఖిల్‌ ట్వీట్ చేస్తూ.. ‘అమెరికా 20 ఏళ్ల పాటు ఒక దేశాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. చివరకు వారిని వదిలేసి వెళ్లిపోయారు. మిస్టర్‌ బైడెన్‌ మరోసారి స్వేచ్ఛ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది.. యెదవ’ అంటూ కాంట్రవర్సీ ట్వీట్ చేశాడు. మరి ఈ ట్వీట్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

నిఖిల్ చేసిన ట్వీట్..

Also Read: Good News: చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. దేశంలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే?

Flipkart Apple day sale: యాపిల్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే త్వరపడండి. భారీ డిస్కౌంట్‌లు ఉన్నాయి.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 19 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Loading...
Unable to load recommendations.
Follow Us