డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు (63) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గుండె పోటుకు గురైన ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం కన్నుముశారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
మోహన్ బాబు సోదరుడు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 9 గంటలకు తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మోహన్ బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. రంగస్వామి మృతితో మోహన్ బాబు కుటుంబం, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Also Read: KTR and Samantha: మంత్రి కేటీఆర్పై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..
Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!
RNR Manohar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు.. దర్శకుడు కన్నుమూత..