Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు కోర్టు షాక్.. సమన్లు జారీ..!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఓ కంపెనీకి రూ.5కోట్ల చెల్లింపు విషయంలో ప్రకాష్ రాజ్ చెక్ ఇచ్చారు.

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు కోర్టు షాక్.. సమన్లు జారీ..!

Updated on: Mar 11, 2020 | 9:23 PM

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు మద్రాసు  ఫాస్ట్‌ట్రాక్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఓ కంపెనీకి రూ.5కోట్ల చెల్లింపు విషయంలో ప్రకాష్ రాజ్ చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 318 కింద ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. కేసుకు సంబంధించి ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

కాగా తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను సొంత దర్శకత్వంలో నిర్మించి నటించారు ప్రకాష్ రాజ్. ఇక తమిళంలో రూపొందించిన ‘ఉన్ సమయల్ అరైయిల్’ సినిమాను నడిగర్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు ఈ నటుడు. ఈ సినిమా కోసం ఆయన బాలీవుడ్ ఫైనాన్షియర్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలో దాన్ని తీర్చేందుకు ఆ ఫైనాన్షియర్‌కు చెక్ ఇవ్వగా.. అది బౌన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి కంపెనీ కోర్టుకు ఆశ్రయించారు.

Read This Story Also: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్

Follow Us