సోను సూద్ దాతృత్వంలో మరో కోణం.. మరోసారి వార్తల్లోకి సినీ విలన్.. ఈసారి హైలైట్ ఏంటంటే..?

| Edited By: Rajesh Sharma

Dec 09, 2020 | 3:04 PM

లాక్‏డౌన్ సమయంలో నిరుపేదలకు సహయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు ప్రముఖ నటుడు సోనుసూద్. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, రైళ్ళు

సోను సూద్ దాతృత్వంలో మరో కోణం.. మరోసారి వార్తల్లోకి సినీ విలన్.. ఈసారి హైలైట్ ఏంటంటే..?
Follow us on

లాక్‏డౌన్ సమయంలో నిరుపేదలకు సహయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు ప్రముఖ నటుడు సోనుసూద్. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, రైళ్ళు ఏర్పాటు చేసి వారిని సొంత ఊర్లకు పంపించాడు. అంతేకాకుండా వారికి భోజనం, వైద్య, విద్య ఖర్చులు కూడా భరించాడు. కేవలం వలస కార్మికులకే కాకుండా ఎవరు ఏ సహయం అడిగిన కాదనకుండా తనవంతు సాయం చేస్తున్నాడు ఈ రియల్ హీరో. సోనూసూద్ నుంచి సహయం పొందిన వారు అతడిని దేవుడిలా కోలుస్తున్నారు.

ఈ క్రమంలో సోనూసూద్ రూ.10 కోట్ల విరాళం సమకూర్చడానికి ముంబాయిలోని జుహూలోగల తన 8 ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లుగా సమాచారం వస్తుంది. అందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట. సెప్టెంబర్ 15న ఈ అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబర్ 24న రిజిస్ట్రేషన్ జరిగిందని సమాచారం. కాగా “ఎదుటివారి కోసం ఇలాంటి పనిచేసిన వాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు” అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ రితేష్ మెహతా ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంకా ఈ విషయం గురించి సోనూసూద్ నుంచి ఏలాంటి స్పందన రాలేదు.