
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మొదట హీరోయిన్లుగా అలియాభట్, బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ జోన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ ను తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో నటించే వీలు లేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు జక్కన్న మరోసారి హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాడు.