AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడమ్ టుస్సాడ్స్‌లో హిందీ ‘అర్జున్ రెడ్డి’

రీసెంట్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఆ బొమ్మను హైదరాబాద్ తీసుకొచ్చి ఏఎమ్‌బీ థియేటర్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచి మళ్లీ సింగపూర్ తీసుకెళ్లారు.  తాజాగా హిందీ అర్జున్ రెడ్డి ఫేమ్ కబీర్ సింగ్‌ అదేనండి షాహిద్‌ కపూర్ మైనపు విగ్రహం సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో  కొలువైంది. ఈ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి షాహిద్ కపూర్ హాజరయ్యాడు. అంతేకాదు అక్కడ తన మైనపు […]

మేడమ్ టుస్సాడ్స్‌లో హిందీ 'అర్జున్ రెడ్డి'
Ram Naramaneni
|

Updated on: May 16, 2019 | 4:52 PM

Share

రీసెంట్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఆ బొమ్మను హైదరాబాద్ తీసుకొచ్చి ఏఎమ్‌బీ థియేటర్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచి మళ్లీ సింగపూర్ తీసుకెళ్లారు.  తాజాగా హిందీ అర్జున్ రెడ్డి ఫేమ్ కబీర్ సింగ్‌ అదేనండి షాహిద్‌ కపూర్ మైనపు విగ్రహం సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‌లో  కొలువైంది. ఈ మైనపు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి షాహిద్ కపూర్ హాజరయ్యాడు. అంతేకాదు అక్కడ తన మైనపు బొమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్, షారుఖ్, సల్మాన్, ప్రభాస్, ఐశ్వర్య, మాధురి, కత్రినా, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా  సహా ఎంతో మంది భారతీయ సెలబ్రిటీల మైనపు విగ్రహాలు కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఇప్పుడా నటీనటలు సరసన షాహిద్ చేరాడు.  ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’  మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.

View this post on Instagram

#twinning

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on