మళ్లీ టాలీవుడ్‌కి సెన్సేషనల్‌ దర్శకుడు.. చెర్రీ కోసం కథ రెడీ చేస్తున్నాడా..!

| Edited By:

Sep 25, 2020 | 3:48 PM

అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వగా

మళ్లీ టాలీవుడ్‌కి సెన్సేషనల్‌ దర్శకుడు.. చెర్రీ కోసం కథ రెడీ చేస్తున్నాడా..!
Follow us on

Story for Ram Charan: అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వగా.. ఈ దర్శకుడి పేరు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు పలువురు టాప్ నిర్మాతలు సైతం అతడి కోసం క్యూ కట్టారు. అయితే ఈ లోపే బాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో అక్కడకు వెళ్లిపోయారు. అర్జున్ రెడ్డిని అక్కడ కబీర్‌సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో హిందీలోనే ఆయనకు మరో ఆఫర్ వచ్చింది. కబీర్ సింగ్ నిర్మాతలు సందీప్‌తో మరో సినిమాను ప్రకటించారు.

ఇది జరిగి దాదాపుగా సంవత్సరం కావొస్తుంది. అయితే ఇంతవరకు ఆ ప్రాజెక్ట్‌ గురించిన తదుపరి విషయాలేవీ బయటకు రాలేదు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కి ఏ హీరో కన్ఫర్మ్ కాలేదని, దీంతో అటకెక్కిందని తెలుస్తోంది. ఈ క్రమంలో సందీప్‌ మళ్లీ టాలీవుడ్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలోకి వెళ్లకముందు ఈ దర్శకుడు రామ్ చరణ్‌, మహేష్‌ బాబు, ప్రభాస్ వంటి హీరోలకు కథలు చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీటిలో ఏవీ ఫైనల్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మిగిలిన హీరోలందరూ బిజీగా ఉండగా.. చెర్రీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలనుకుంటున్న సందీప్‌.. చెర్రీ కోసం కథను రాస్తున్నట్లు తెలుస్తోంది.

Read More:

Bigg Boss 4: ఇవాళ ‘బిగ్‌’ ట్విస్ట్‌

SPB Death: నింగికేగిన బాలు.. ప్రముఖుల నివాళులు