Samantha: ఆ బాధతో రాత్రుళ్లు నిద్ర పోలేదు, కానీ ఇప్పుడు… సమంత చేసిన ఈ వ్యాఖ్యలు దేని గురించంటే..
Samantha: తెలుగు ప్రేక్షకులకు ఆ మాటకొస్తే సౌత్ ఇండియన్ ఆడియన్స్కు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది...
Samantha: తెలుగు ప్రేక్షకులకు.. ఆ మాటకొస్తే సౌత్ ఇండియన్ ఆడియన్స్కు సమంత పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుని, ఎంతో పేరు సంపాదించుకుంది. కెరీర్ పరంగా పీక్స్ చూసిన సమంత వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఒడిదొడుకులకు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సమంత ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ ఆఫర్లు క్యూకడుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం తనకు ఎంతో ఇష్టమని తెలిపిన సమంత.. ‘ఎన్నో మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో నేరుగా కనెక్ట్ కావొచ్చు.
అయితే నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ విషయంలో మొదట్లో చాలా బాధ పడేదాన్ని. ఈ బాధతో రాత్రుళ్లు నిద్ర కూడా పోని సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అలవాటైపోయింది. వాటిని పట్టించుకోవడం మానేశాను. అయితే నిజమైన అభిమానుల చేసే సద్వివిమర్శలను మాత్రం స్వీకరిస్తాను. వాటికి తగ్గుట్టుగా నన్ను నేను మార్చుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషీ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..