ప్రకాశ్ రాజ్‏ను చూసి భయపడ్డానంటున్నా ఫిదా బ్యూటీ.. డిసెంబర్ 18న ఆ సినిమా రిలీజ్..

|

Dec 08, 2020 | 11:28 AM

తెలుగులో ఫిదా సినిమాలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి వరుస మూవీలతో బిజిగా మారారు. సినిమా సెట్‏లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‏ను చూసి చాలా భయపడ్డానని ఆమె తెలిపింది.

ప్రకాశ్ రాజ్‏ను చూసి భయపడ్డానంటున్నా ఫిదా బ్యూటీ.. డిసెంబర్ 18న ఆ సినిమా రిలీజ్..
త్వరలోనే ఈ ముద్దుగుమ్మ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతోందని టాక్.   
Follow us on

తెలుగులో ఫిదా సినిమాలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి వరుస మూవీలతో బిజిగా మారారు. సినిమా సెట్‏లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‏ను చూసి చాలా భయపడ్డానని ఆమె తెలిపింది. ఆమె నటించిన చిత్రం పావకదైగల్ తమిళ దర్శకులు గౌతమ్ మీనన్, వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్. నాలుగు కథలతో దీన్ని రూపొందించారు. ఇందులో సాయి పల్లవి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించారు. సిమ్రాన్ అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్, గౌతమ్ మేనన్ తదితర పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 18న ఈ మూవీని నెట్‏ఫ్లిక్స్‏లో విడుదల చేయనున్నారు.

అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‏సైట్‏కు సాయిపల్లవి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రకాశ్ రాజ్‏తో కలిసి పనిచేయడం గురించి యాంకర్ ప్రశ్నించగా.. తండ్రిగా ప్రకాశ్ రాజ్ సెట్‏లో నడుచుకుని వస్తుంటే.. ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని. ఆయన దాదాపు సెట్‏లో క్యారెక్టర్‏లో ఉండేవారు అని అన్నారు. అనంతరం తన డాక్టర్ ఉద్యోగం గురించి అడగగా సినిమాల్లో నటించడం పూర్తయ్యాక కచ్చితంగా వైద్య వృత్తిపై దృష్టి పెడతా, దాన్నే కొనసాగిస్తా. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దీన్ని ఎప్పుడో నిర్ణయించుకున్నా.. డాక్టర్ వృత్తిపై నాకెంతో గౌరవం ఉంది అని చెప్పారు సాయిపల్లవి. ఇటీవల విడుదల చేసిన పావకదైగల్ సినిమా ట్రైలర్‏కు మంచి స్పందన లభించింది.