నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు.. దర్శకుడిపై ప్రసంశలు కురిపించిన సాయి పల్లవి

|

Dec 22, 2020 | 3:45 PM

ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరైయింది సాయి పల్లవి. ఆ సినిమా తర్వత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు.. దర్శకుడిపై ప్రసంశలు కురిపించిన సాయి పల్లవి
Follow us on

ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరైయింది సాయి పల్లవి. ఆ సినిమా తర్వత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  నాగచైతన్య తో కలిసి ఓ సినిమా చేస్తుంది సాయి పల్లవి. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను పనిచేసిన దర్శకుల గురించి వివరించింది సాయి పల్లవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల పై ప్రసంశలు కురిపించింది.    నేను ప్రస్తుతం జీవితాన్ని చూసే విధానాన్ని ఆయనే నాకు నేర్పించారు. శేఖర్ గారు నాకు దర్శకుడు కంటే ఎక్కువ నాకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. నేను తేలిగ్గా వాటి నుండి బయటపడతాను. ఈ పోరాటం నాకు నేర్పింది శేఖర్ కమ్ముల గారే ” అంటూ చెప్పుకొచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో చేస్తుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనుంది.