ఆసుపత్రిలో తప్పు చేసినట్లుగా రియా ప్రవర్తించింది: ప్రత్యక్షసాక్షి

బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్ 21న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.

ఆసుపత్రిలో తప్పు చేసినట్లుగా రియా ప్రవర్తించింది: ప్రత్యక్షసాక్షి

Updated on: Aug 23, 2020 | 11:10 AM

Sushant Singh death Case: బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్ 21న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అతడి మృత దేహానికి జూన్ 15న కూపర్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అప్పుడు నటి, సుశాంత్ లవర్ రియా చక్రవర్తి కూడా అక్కడే ఉన్నారు. కాగా ఆ సమయంలో ఏదో తప్పు చేసినట్లుగా రియా ప్రవర్తించిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షి, కర్ణిసేన సభ్యుడు సుర్జీత్ సింగ్ రాథోర్‌ వెల్లడించారు. అంతేకాదు సుశాంత్ శరీరంపై చేయి వేసి క్షమించమని కోరినట్లు కూడా అతడు తెలిపారు.

సుశాంత్‌ మృతదేహాన్ని రియాకు చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని నేను రిక్వెస్ట్ చేశా. అందుకు వారు సమ్మతించడంతో రియా సుశాంత్ మృతదేహాన్ని చూసేందుకు వెళ్లింది. సుశాంత్‌ బాడీపై ఉన్న గుడ్డను నేను తీయగా.. రియా అతడి గుండె మీద చేయి వేసి సారీ బాబు అని చెప్పింది అని రాథోర్ వివరించారు. ఇక ఈ కేసులో తమ ముందుకు రావాలని సీబీఐ అడిగిందని, దానికి తాను ఒప్పుకున్నానని ఆయన అన్నారు. కాగా మరోవైపు సుశాంత్ కేసును విచారణకు తీసుకున్న సీబీఐ, ఇప్పటికే పలువురిని విచారించింది. అలాగే శుక్రవారం సుశాంత్ నివాసానికి వెళ్లింది.

Read More:

అచ్చెన్నాయుడుని మంగళగిరి ఆసుపత్రికి తరలింపు

సైరాలో చెర్రీ నటించాల్సింది.. కానీ వద్దన్న చిరు.. ఎందుకంటే!

 

Loading...
Unable to load recommendations.
Follow Us