మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను నటించిన రంగస్థలంలోని ఓ ఫొటోను షేర్ చేసిన చెర్రీ.. కేవలం విశ్వసనీయమైన విషయాలను మాత్రమే వింటాను అని ఓ కామెంట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్, చరణ్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించే చెర్రీ ఈ పోస్ట్ పెట్టాడని కొంతమంది అంటున్నారు.
వర్మ, ‘పవర్స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చెర్రీ ఈ పోస్ట్ పెట్టాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాగా కెరీర్ ప్రారంభంలోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. జగన్, జైలుకి వెళ్లిన సమయంలో ఓ పోస్ట్ చేశారు. దాంతో కొంతమంది చెర్రీని టార్గెట్ చేశారు. దాంతో ట్విట్టర్ నుంచి వైదొలిగిన రామ్ చరణ్.. ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Listening to Credible Info ONLY!! pic.twitter.com/x5iNV9MALD
— Ram Charan (@AlwaysRamCharan) July 24, 2020