ఆ వార్తలన్నీ అవాస్తవాలే.. ప్రభాస్ సన్నిహితుల మాటేంటంటే..!

| Edited By:

Dec 27, 2019 | 1:04 PM

ఈ ఏడాది సాహోతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ తరువాత ప్రభాస్, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్‌ […]

ఆ వార్తలన్నీ అవాస్తవాలే.. ప్రభాస్ సన్నిహితుల మాటేంటంటే..!
Follow us on

ఈ ఏడాది సాహోతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ తరువాత ప్రభాస్, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్‌ పతాకం సంయుక్తంగా నిర్మిస్తోన్న డెవిల్ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి.

హిందీలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మొదట రణ్‌బీర్‌ను సంప్రదించాడు సందీప్ రెడ్డి వంగ. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ మూవీలో నటించేందుకు రణ్‌బీర్ కూడా ఓకే చెప్పాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు రణ్‌బీర్. ఈ క్రమంలోనే డెవిల్ కోసం సందీప్, ప్రభాస్‌ను కలిశాడని.. కథను విన్న డార్లింగ్ అందులో నటించేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగం కానుందని.. ఇందుకోసం ప్రభాస్‌తో రూ.75కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు కూడా టాక్ వినిపించింది. అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇవన్నీ వట్టి మాటలేనట. ప్రస్తుతం జాన్ మూవీ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్.. ఇంతవరకు వేరే స్క్రిప్ట్‌లు ఏవీ వినలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇటు ప్రభాస్‌తోనూ.. అటు సందీప్ వంగతోనూ మైత్రీ మూవీ మేకర్స్ వేర్వేరుగా డీలింగ్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా జాన్ మూవీ తరువాత దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ నటించనుండగా.. ఆ తరువాతే మైత్రీ మూవీ మేకర్స్‌లో నటించబోతున్నాడట. అలాగే తెలుగులో ఏషియన్ సినిమాతో అగ్రిమెంట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో సినిమాను పూర్తి చేసిన తరువాతే మైత్రీ నిర్మాణంలో సినిమా చేయబోతున్నాడట. దీంతో ప్రభాస్- సందీప్ కాంబినేషన్లో ఇప్పట్లో సినిమా రావడం కష్టమేనని టాలీవుడ్ వర్గాల సమాచారం.