Maname OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Aug 10, 2024 | 4:31 PM

విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు

Maname OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న శర్వానంద్ మనమే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Maname Ott
Follow us on

విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా మనమే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది. జూన్ 7న అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. రొటిన్ స్టోరీ అయినా శర్వానంద్, కృతి శెట్టి కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే ఇందులో వీరిద్దరి యాక్టింగ్ ఆకట్టుకుంది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 22 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.

ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

కథ విషయానికి వస్తే..
శర్వానంద్, కృతి శెట్టి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లిదండ్రులుగా మారతారు. అనుకోని ప్రమాదంలో శర్వానంద్ స్నేహితుడు చనిపోవడంతో అతడి కొడుకును చూసుకునే బాధ్యత శర్వానంద్ పై పడుతుంది. పెళ్లి కాకుండానే బిడ్డకు తల్లిదండ్రులుగా మారడం.. ఆ ప్రయాణంలో శర్వానంద్, కృతి శెట్టి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? చివరకు వారిద్దరి జీవితంలో ఏం జరిగిందనేది సినిమా. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.