Bhuj Movie: ఓటీటీలోకి అజయ్ దేవ్‏గణ్ సినిమా.. ‘భుజ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Jul 07, 2021 | 2:29 PM

సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు వినోదాన్ని చెంతకు చేరుస్తున్న ఓటీటీలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. సూపర్ హిట్ సినిమాలతోపాటు.. వెబ్ సిరీస్‏లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Bhuj Movie: ఓటీటీలోకి అజయ్ దేవ్‏గణ్ సినిమా.. భుజ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bhuj
Follow us on

సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు వినోదాన్ని చెంతకు చేరుస్తున్న ఓటీటీలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. సూపర్ హిట్ సినిమాలతోపాటు.. వెబ్ సిరీస్‏లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ వారం రోజులకు సరికొత్త కంటెంట్‏తో కూడిన సూపర్ హిట్ చిత్రాలు విడుదలవుతుండగా.. తాజాగా మరో హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‏గణ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటించిన ‘భుజ్’ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‏స్టార్‏లో విడుదలకు సిద్ధమైంది. ఇందులో అజయ్ దేవ్‏గణ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్‏గా నటించారు.

అయితే గతంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా వెల్లడించిన తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఓ ప్రత్యేకమైన వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు అజయ్ దేవ్‏గణ్. “1971లో జరిగిన గొప్ప యుద్ధం భుజ్‏గా ఆగస్టు 13న మీ ముందుకొస్తుందని” ట్వీట్ చేశారు. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన భుజ్ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ ఖేల్‏కర్, యమ్మీ, విర్క్ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. అభిషేక్ దుదయా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

ట్వీట్..

Also Read: Case on Bhargavram: మొదటి కేసులో నుంచి ఇంకా బయటపడలేదు.. మళ్లీ ఇంకో కేసు నమోదు..!

Pregnant Women: విశాఖ ఏజెన్సీలో విషాదం.. డోలీ కట్టినా నిలువని తల్లీబిడ్డల ప్రాణం.. కంటతడి పెట్టిస్తున్న ఘటన

MAA Elections: ‘మా’ ఎన్నికలు.. ఏకగ్రీవం కోసం సీనియర్ల ప్రయత్నాలు.. సరికొత్త చర్చకు తెరలేపిన ప్రకాష్ రాజ్ ట్వీట్..