అఖిల్‌తో సురేందర్ రెడ్డి మూవీ.. అధికారిక ప్రకటన

అక్కినేని వారసుడు అఖిల్ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. స్టైలిష్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ 5వ చిత్రంలో నటించనున్నారు.

అఖిల్‌తో సురేందర్ రెడ్డి మూవీ.. అధికారిక ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 1:09 PM

Akhil-Surender Reddy movie: అక్కినేని వారసుడు అఖిల్ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. స్టైలిష్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ 5వ చిత్రంలో నటించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నాకు చాలా స్పెషల్‌. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది అంటూ అఖిల్‌ ట్వీట్ చేశారు. కాగా సురేందర్ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌తోనూ ఓ మూవీని ప్రకటించగా.. అఖిల్‌ మూవీ తరువాత పవర్‌స్టార్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ప్రస్తుతం అఖిల్‌, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. జీ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు.

Read More:

‘ప్లాస్మా థెరపీ’తో పెద్ద ప్రయోజనం లేదు: ఐసీఎంఆర్‌

పీసీ శ్రీరామ్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందన.. ‘ఆల్‌ ది బెస్ట్’ అంటూ ట్వీట్‌