శ్రీదేవి లేకుండా సీక్వెల్.. తన వల్ల కాదన్న దర్శకుడు

శ్రీదేవి లేకుండా ఆ మూవీని తాను తెరకెక్కించలేనని మరోసారి స్పష్టం చేశారు బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా ఈ దర్శకుడు 1987లో ‘మిస్టర్ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌పై మరోసారి వార్తలు వచ్చాయి. ఇటీవల శేఖర్ కపూర్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన అనిల్ కపూర్.. దానికి కామెంట్‌గా […]

శ్రీదేవి లేకుండా సీక్వెల్.. తన వల్ల కాదన్న దర్శకుడు
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 5:11 PM

శ్రీదేవి లేకుండా ఆ మూవీని తాను తెరకెక్కించలేనని మరోసారి స్పష్టం చేశారు బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా ఈ దర్శకుడు 1987లో ‘మిస్టర్ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌పై మరోసారి వార్తలు వచ్చాయి. ఇటీవల శేఖర్ కపూర్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన అనిల్ కపూర్.. దానికి కామెంట్‌గా మిస్టర్ ఇండియా సీక్వెల్‌ను ప్రస్తావించాడు. దీంతో ఈ సీక్వెల్ తెరకెక్కనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

అయితే దీనిపై తాజాగా స్పందించిన శేఖర్ కపూర్.. ‘‘శ్రీదేవి మరణించారు. మిస్టర్ ఇండియా 2 కూడా లేనట్లే. ఆమె లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేను. అనిల్ ఒప్పుకున్నా.. ఈ చిత్ర నిర్మాత బోని కపూర్ ఉద్దేశం కూడా నాకు తెలీదు. కానీ ఆ సీక్వెల్‌కు మాత్రం నేను దర్శకత్వం వహించలేను. ఆమె లేకుండా ఈ సీక్వెల్ సాధ్యం కాదు’’ అంటూ పేర్కొన్నారు. కాగా మిస్టర్ ఇండియా చిత్రంలో శ్రీదేవి నటన మరవలేనిది. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరినీ ఊహించుకోలేమన్నది సినీ ఇండస్ట్రీ ఎరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే ఆమె లేకుండా తాను ఈ సినిమాను తీయలేనని దర్శకుడు శేఖర్ కపూర్ తేల్చి చెప్పారు.