Mohan Babu: ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టిస్తుంది. దాంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు
Mohan Babu
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టిస్తుంది. దాంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు, అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా విషయం తెలిసిందే. కేసీఆర్ కు కరోనా అని తెలిసి కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అందరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంల్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కేసీఆర్ త్వరగా కరోనా నుంచి బయట పడాలని కోరుకున్నారు. మోహన్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘పోరాటయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుడుని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
పోరాట యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కే.సి.ఆర్. గారు… ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే ఆయన్ని కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. @TelanganaCMO
— Mohan Babu M (@themohanbabu) April 20, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
కరోనా బారిన పడ్డ జబర్దస్త్ బ్యూటీ.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ ఎమోషనల్….