‘ఆచార్య’ స్టోరీ రివీల్ చేసిన చిరు.. కొరటాల మళ్లీ అలాంటి పాత్రతోనే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన కథను తాజాగా చిరంజీవి రివీల్ చేశారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ నటించిన పాత్రలాంటిదే తాను ఆచార్యలో పోషిస్తున్నానని చిరు తెలిపారు.
జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ ప్రకృతి ప్రియుడిగా, వాతావరణాన్ని కాపాడేందుకు పోరాడుతుంటారని.. తాను ఈ సినిమాలో ప్రొఫెసర్గా సహజ వనరులను కాపాడేందుకు పోరాడుతుంటానని ఆయన తెలిపారు. అంతేకాదు ప్రొఫెసర్ అవ్వకముందే తాను నక్సలైట్గా పనిచేస్తానని వివరించారు. ఇక రామ్ చరణ్ ఇందులో తన శిష్యుడి పాత్రలో కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని అకట్టుకునే విధంగా ఈ సినిమాను కొరటాల తెరకెక్కించిబోతున్నారని చిరు చెప్పారు. కొరటాల వర్కింగ్ స్టైల్కు తాను ఫిదా అయ్యానని ఈ సందర్భంగా చిరు చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
Read This Story Also: ‘అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట’.. ఓవైసీ ఫైర్.. ‘కమ్యూనల్ వైరస్’ అంటూ ట్వీట్…