ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా తెరకెక్కించనున్నట్లు వినికిడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమాకి ఇది సీక్వెల్ అని సమాచారం. మంచు విష్ణు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.
శ్రీను వైట్ల ఈ మధ్య రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం తీశారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మంచు విష్ణు సినిమాతో పాటు త్వరలో ఒక వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ చేయనున్నాడట శ్రీను వైట్ల. చూద్దాం ఈ రెండిటితో అయిన మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో.?