Mahesh New Movie Update: త్వరలో గోవాకు పయనం కానున్న సర్కారు వారి పాట చిత్ర యూనిట్

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి , సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో వరస హిట్స్ తో జోరుమీదురున్న ప్రిన్స్‌ మహేశ్‌ బాబు తాజగా సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న...

Mahesh New Movie Update: త్వరలో గోవాకు పయనం కానున్న సర్కారు వారి పాట చిత్ర యూనిట్
Follow us

|

Updated on: Feb 22, 2021 | 4:43 PM

Mahesh New Movie Update: శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి , సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో వరస హిట్స్ తో జోరుమీదురున్న ప్రిన్స్‌ మహేశ్‌ బాబు తాజగా సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడీగా తొలిసారిగా మహానటి ఫేమ్ కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నా ఏర్పడ్డాయి.

ఇక తాజాగా ఈ సినిమా ఓ షెడ్యూల్‌ ను దుబాయ్‌లో ముగించుకుని స్వదేశీ బాట పట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దుబాయ్‌లోని రిచ్‌ లొకేషన్స్‌లో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్‌ దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట టీమ్‌.. దుబాయ్‌కి గుడ్‌ బై చెప్పింది. దాదాపు నెల రోజులకిపైగా దుబాయ్‌లో షూటింగ్‌ జరుపుకున్న సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్‌ ఆదివారంతో పూర్తయింది.

ఇక దుబాయ్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ తర్వాత గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కీలక సన్నివేశాలను గోవాలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.సరిలేరు నీకెవ్వరు భారీ ఎంటర్‌టైనర్‌ తరువాత మహేష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్లు 35 కోట్లకు అమ్ముడు పోయాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

శరవేగంగా జరుపుకుంటున్న పవన్, రానా మూవీ.. సెట్ లో పవన్ ను చూసి అంతా షాక్

 ముంబైలో ఎంపీ ఆత్మహత్య.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు