AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహా సముద్రం’ కోసం గోవా వెళ్లనున్న టీమ్‌..!

శర్వానంద్‌, సిద్ధార్థ్‌లతో 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ 'మహా సముద్రం'. అదితీరావు హైదారీ, అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు

'మహా సముద్రం' కోసం గోవా వెళ్లనున్న టీమ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 01, 2020 | 12:17 PM

Share

Maha Samudram update: శర్వానంద్‌, సిద్ధార్థ్‌లతో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ ‘మహా సముద్రం’. అదితీరావు హైదారీ, అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ఈ నెల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటి షెడ్యూల్‌ని గోవాలో ప్లాన్ చేశారట దర్శకుడు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతున్నట్లు సమాచారం. (RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అడుగుపెట్టనున్న లేడీ స్కాట్‌)

ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమర్షియల్‌ ఎలిమెంట్లు, ట్విస్ట్‌లు చాలానే ఉండనున్నట్లు టాక్‌. కాగా ఈ మూవీతో దాదాపు 8 ఏళ్ల తరువాత సిద్ధార్థ్‌ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన సిద్ధార్థ్‌.. ”నేను మళ్లీ వచ్చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది” అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇక ఈ మల్టీస్టారర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ( పవన్‌ మూవీ కోసం నితిన్‌ కీలక నిర్ణయం..!)