70 శాతం స్ట్రోక్, 30 శాతం ప్రాణహాని.. సంచలన విషయాలు వెల్లడించిన టాలీవుడ్ టాప్ హీరో దగ్గుబాటి రానా..

|

Nov 25, 2020 | 1:48 PM

టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో, ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా తన ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా ఏదైనా ప్రాజెక్ట్ టేకాఫ్ చేశారంటే దానికోసం ఎంత శ్రమిస్తాడో మనందరికి తెలుసు. బాహుబలిలో బళ్లాలదేవుడి క్యారెక్టర్‌కి రానాను తప్పించి మరే హీరోను ఊహించుకోలేరు ప్రేక్షకులు.

70 శాతం స్ట్రోక్, 30 శాతం ప్రాణహాని.. సంచలన విషయాలు వెల్లడించిన టాలీవుడ్ టాప్ హీరో దగ్గుబాటి రానా..
Follow us on

టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో, ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా తన ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా ఏదైనా ప్రాజెక్ట్ టేకాఫ్ చేశారంటే దానికోసం ఎంత శ్రమిస్తాడో మనందరికి తెలుసు. బాహుబలిలో బళ్లాలదేవుడి క్యారెక్టర్‌కి రానాను తప్పించి మరే హీరోను ఊహించుకోలేరు ప్రేక్షకులు. అంతలా సినిమాలో లీనమైపోతారు అలాంటిది రానా ఇటీవల అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రానా ఓ ఇంటర్వూలో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

తన జీవితం వేగంగా వెళుతున్న సమయంలో అనుకోకుండా ఓ చిన్న సమస్య వచ్చిపడిందని, అదేంటంటే చిన్నప్పటి నుంచి తనకు బీపీ ఉండేదని తెలిపారు. దీంతో గుండె చుట్టూ ఉండే పొర పెలుసుబారుతోందని, దీనివల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయని వైద్యులు తెలిపారని వెల్లడించారు. ఈ సమస్య వల్ల 70 శాతం స్ట్రోక్ రావచ్చని, 30 శాతం ప్రాణహాని ఉంటుందని ఎమోషన్ అయ్యారు. అయితే ఇటీవల తన ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం తన కెరీర్, పర్సనల్ లైఫ్‌తో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక లాక్‌డౌన్ సమయంలో రానా వివాహం మిహికాతో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రానా విరాటపర్వం అనే సినిమా చేస్తున్నారు.