5 సంవత్సరాల తర్వాత.. క్రేజీ కాంబో ఈజ్‌ బ్యాక్‌

| Edited By:

Oct 16, 2020 | 2:42 PM

కొన్ని కాంబినేషన్‌లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అది డైరెక్టర్-హీరో అవ్వొచ్చు లేదా హీరో- హీరోయిన్‌ అవ్వొచ్చు లేదా హీరో- మ్యూజిక్ డైరెక్టర్ కావొచ్చు

5 సంవత్సరాల తర్వాత.. క్రేజీ కాంబో ఈజ్‌ బ్యాక్‌
Follow us on

Dhanush Anirudh combination: కొన్ని కాంబినేషన్‌లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అది డైరెక్టర్-హీరో అవ్వొచ్చు లేదా హీరో- హీరోయిన్‌ అవ్వొచ్చు లేదా హీరో- మ్యూజిక్ డైరెక్టర్ కావొచ్చు. ఇలా క్రేజీ కాంబోలో మళ్లీ సినిమా వస్తుందంటేనే దానిపై అంచనాలు తెలికుండానే పెరుగుతుంటాయి. అలాంటి కాంబోనే ధనుష్-అనిరుధ్‌లది. ధనుష్ నటించిన 3 మూవీ ద్వారా సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన అనిరుధ్‌.. ఆ తరువాత ఆ హీరో నటించిన మారి, తంగ మాగన్‌(తెలుగులో నవమన్మధుడు), వెలైయిల్ల పట్టాదారి(తెలుగులో వీఐపీ) చిత్రాలకు సంగీతం అందించారు. ఈ చిత్రాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యాయి.

అయితే కారణాలు తెలీదు గానీ.. ఈ కాంబోకు సడన్‌గా బ్రేక్ పడింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు కూడా అప్పట్లో టాక్ నడిచింది. అంతేకాదు మారి, వెల్లైయిల్ల పట్టాదారి సీక్వెల్‌లకు అనిరుధ్‌ పనిచేయలేదు. దీంతో వీరి గ్యాప్ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ ఈ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. ధనుష్‌ హీరోగా మిత్రన్ జవహర్ తెరకెక్కిస్తోన్న మూవీకి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇవాళ అనిరుధ్‌ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ.. ఓ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ‘డీఅండ్‌ఏ’ ఈజ్ బ్యాక్‌ అని కామెంట్ పెట్టింది. మరి ఈ కాంబోలో ఈ సారి ఎలాంటి సెన్సేషనల్‌ ఆల్బమ్‌ రాబోతుందో చూడాలంటే ఇంకొన్ని నెలలు ఎదురుచూడాల్సిందే.

Read More:

బీజేపీ క్యాంపైన్‌ పాటను నా సాంగ్‌ నుంచి కాపీ కొట్టారు: బాలీవుడ్ స్టార్ దర్శకుడు

కోహ్లీ డ్యాన్స్ వీడియోపై ఆర్చర్‌ ఫన్నీ కామెంట్‌