‘రంగ్ దే’ టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!

| Edited By:

Oct 30, 2020 | 11:07 AM

నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ రంగ్‌ దే. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో

రంగ్ దే టీమ్‌కి మళ్లీ ఇబ్బందులు..!
Follow us on

Rang De Shooting: నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న లవ్‌ ఎంటర్‌టైనర్ రంగ్‌ దే. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో.. ఈ మూవీ కూడా ఆ మధ్యన సెట్స్ మీదకు వెళ్లింది. అంతేకాదు ఓ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రంగ్‌ దేకి సంబంధించి ఒకే ఒక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉంది.

అందులో కొన్ని సన్నివేశాలతో పాటు పాటలు ఉన్నాయి. వాటిని ఇటలీలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక ఈ షూటింగ్‌ని పూర్తి చేసేందుకు ఈ వారంలోనే ఇటలీకి వెళ్లేందుకు ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. (IPl 2020: దినేష్ కార్తీక్‌, అంపైర్‌ మధ్య తెలుగు సంభాషణ.. వీడియో వైరల్‌)

ఇటలీలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వగా.. అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీంతో రంగ్‌ దే టీమ్‌ ఇటలీ షెడ్యూల్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన చిత్రీకరణను దుబాయ్‌లో జరపాలని మూవీ యూనిట్ భావిస్తోందట. అయితే భారత్‌లో కేసుల దృష్ట్యా దుబాయ్ కూడా ఆ మధ్యన పలు ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో మరి మిగిలిన ఒకే ఒక్క షెడ్యూల్‌ని రంగ్‌ దే టీమ్‌ ఎక్కడ పూర్తి చేస్తుందో చూడాలి. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.(ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో)