AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్‌’పై కీలక నిర్ణయం తీసుకున్న జక్కన్న..!

కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయో కూడా ఎవ్వరికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్‌'పై జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'ఆర్ఆర్ఆర్‌'పై కీలక నిర్ణయం తీసుకున్న జక్కన్న..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 8:34 AM

Share

కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయో కూడా ఎవ్వరికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్‌’పై జక్కన్న కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదలను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయబోతున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి.. జక్కన్న అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్‌’లో పలువురు విదేశీ నటులు కూడా భాగమైన విషయం తెలిసిందే. వీరు షూటింగ్‌లో పాల్గొనాలంటే.. వారి దేశాలతో పాటు భారత్‌లోనూ లాక్‌డౌన్ ఎత్తివేయాలి. ఆ తరువాతే విదేశీ ఆర్టిస్ట్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో పాలుపంచుకునే అవకాశం ఉంది. ఇక షూటింగ్‌ తరువాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో ఆర్ఆర్ఆర్‌ విడుదలను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేయాలని రాజమౌళి భావిస్తున్నారట.

అయితే ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ఒకసారి వాయిదా పడింది. ‘ఆర్ఆర్ఆర్‌’ను ప్రకటించిన సమయంలో ఈ మూవీని ఈ ఏడాది జూలై 30కు విడుదల చేస్తామని జక్కన్న తెలిపారు. తరువాత షూటింగ్‌లో జాప్యం కారణంగా వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. ఇక ఇప్పటి పరిస్థితుల ప్రకారం మరోసారి రిలీజ్‌ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్‌. అయితే ప్రతి ఫ్రేమ్‌లోనూ పర్‌ఫెక్షన్‌ కోరుకునే రాజమౌళి.. తన మూవీల విడుదలను వాయిదా వేయడం ఇదేం తొలిసారి కాదు. కానీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ‘ఆర్ఆర్ఆర్‌’ విషయంలో ఫ్యాన్స్‌ నుంచి మద్దతు లభించే అవకాశం ఉందన్నది కొందరి అభిప్రాయం.

Read This Story Also: లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు.. ఆ తరువాత..!