రానా పెళ్లి వేడుకలో మార్పులు

కరోనా సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్‌ కూడా షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు.

రానా పెళ్లి వేడుకలో మార్పులు
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 2:35 PM

కరోనా సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్‌లు వివాహం చేసుకోగా.. ఈ ఆదివారం నితిన్‌ కూడా షాలినిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక వచ్చే నెలలో దగ్గుబాటి వారసుడు రానా పెళ్లికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా వివాహాన్ని జరిపేలా పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రానా పెళ్లి వేడుకలో మార్పులు చేశారు. తమ ఇంట్లోనే పెళ్లి చేయాలని రానా తండ్రి, నిర్మాత సురేష్‌ బాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదలైన వివాహ ఆహ్వాన పత్రికలోనూ వెల్లడించారు. అందులోని వివరాల ప్రకారం మణికొండ ఖాజాగూడలోని చైతన్య ఎంక్లేవ్‌లో రానా పెళ్లి జరగనుంది. అంతేకాదు ఈ వేడుకకు ఇరు వర్గాల నుంచి కొద్ది మంది మాత్రమే  హాజరుకానున్నట్లు సమాచారం. కాగా తాను ప్రేమించిన మిహీక బజాజ్‌ను రానా వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే.