AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Second Wave: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న కరోనా.. స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పాజిటివ్..

Corona Second Wave: క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో కోర‌లు చాస్తుంది. సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. గతేడాది ఇదే సమయంలో కరోనా వ్యాప్తి మొదలవగా..

Corona Second Wave: బాలీవుడ్‌ను కుదిపేస్తున్న కరోనా.. స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పాజిటివ్..
Akshay Kumar
Shiva Prajapati
|

Updated on: Apr 04, 2021 | 10:12 AM

Share

Corona Second Wave: క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో కోర‌లు చాస్తుంది. సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. గతేడాది ఇదే సమయంలో కరోనా వ్యాప్తి మొదలవగా.. ఇప్పుడు మళ్లీ ఇదే సమయంలో విజృంభిస్తోంది చేందుతోంది. అయితే, తాజాగా కరోనా మహమ్మారి చిత్ర రంగాన్ని కుదిపేస్తోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. అక్షయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం.. సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోండి. వైద్యుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను.’’ అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు. కాగా, అక్షయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ఆ మేరకు అక్షయ్ ట్వీట్‌కు రిప్లై ఇస్తున్నారు.

ఇదిలాఉంటే. టాప్ స్టార్స్ అంతా వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బాలీవుడ్‌లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే.. ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్‌పాయ్‌, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా అక్షయ్ కుమార్‌ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో బీటౌన్‌లో కంగారు మొదలైంది.

Akshay Kumar Tweet:

Also read:

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది జవాన్లు మృతి.. 21 మంది ఆచూకీ గల్లంతు..

మంచిర్యాల జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఎర్టిగ కారు.. కొడుకు అక్కడికక్కడే మృతి, భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు