మరో బాలీవుడ్ హిట్ మూవీ దక్షిణాది భాషల్లోకి రీమేక్ అవ్వబోతుంది. ఆయుష్మాన్ ఖురానా, సాన్యా మల్హోత్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘బదాయి హో’ను ఇప్పుడు సౌత్లో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ మూవీ రీమేక్ రైట్స్ను తీసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఆయన తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర రీమేక్కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియనున్నాయి.
#Update: #BadhaaiHo in South Indian languages… Boney Kapoor acquires *remake rights* of #BadhaaiHo for South Indian languages… Cast of South Indian films will be announced soon.
— taran adarsh (@taran_adarsh) March 19, 2019
అయితే పెళ్లికి సిద్ధంగా హీరో ఉన్న సమయంలో ఆయన తల్లి నెల తప్పుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో ‘బదాయి హో’ తెరకెక్కింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 200కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రాన్ని సౌత్లో రీమేక్ చేసేందుకు బోని కపూర్ సిద్ధమయ్యాడు. కాగా కంగనా రనౌత్ హీరోయిన్గా వచ్చిన క్వీన్ కూడా దక్షిణాది భాషలన్నింటిలో రీమేక్ అవుతోంది. ఈ మూవీని సంబంధించి అన్ని భాషలలో షూటింగ్ పూర్తైనప్పటికీ, కొన్ని కారణాల వలన ఏ భాషలోనూ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.