‘ఎఫ్‌ 3’కి భారీ బడ్జెట్‌.. ఓకే చెప్పిన దిల్ రాజు.. వెంకీ, వరుణ్‌లకు సమాన పారితోషికం

| Edited By:

Nov 28, 2020 | 10:09 AM

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్‌ 3 డిసెంబర్‌ 14న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 2లో నటించిన వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా

ఎఫ్‌ 3కి భారీ బడ్జెట్‌.. ఓకే చెప్పిన దిల్ రాజు.. వెంకీ, వరుణ్‌లకు సమాన పారితోషికం
Follow us on

Anil Ravipudi F3: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్‌ 3 డిసెంబర్‌ 14న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 2లో నటించిన వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌లే ఈ సీక్వెల్‌లో భాగం కానున్నారు. వీరితో పాటు మరికొందరు ఎఫ్‌ 3లో నటించనున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రేక్షకుల చేత మరింత నవ్వులు పూయిస్తుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ వెల్లడించారు. కాగా ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అందులో ప్రధాన హీరోలైన వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు రూ.12కోట్ల చొప్పున ముట్టనుందని.. అలాగే తమన్నాకు 1.5కోట్లు, మెహ్రీన్‌కి 70లక్షలు, అనిల్‌ రావిపూడికి 9 కోట్లు, దేవీ శ్రీ ప్రసాద్‌కి 2 కోట్లు ఇవ్వనున్నారని సమాచారం. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 2 పెద్ద విజయం సాధించడంతో పాటు దిల్‌ రాజుకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అలాగే జాతీయ స్థాయి అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో పాటు నటీనటులు కూడా బాగానే డిమాండ్ చేసినట్లు టాక్‌. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ 3కి దిల్‌ రాజు ఇంత బడ్జెట్‌ పెట్టబోతున్నట్లు సమాచారం.

కాగా టాలీవుడ్‌లో సీక్వెల్‌లు విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. బాహుబలి మినహా మిగిలిన ఏ సీక్వెల్‌లు అంత విజయాన్ని సాధించలేదు. కొన్ని అయితే ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే వాటన్నింటిని పట్టించుకోకుండా అనిల్‌ కథపై ఉన్న నమ్మకంతో ఈ సీక్వెల్‌కి దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.