RRR: సారీ చెప్పిన అలియా.. రేస్‌లో మరో నటి!

| Edited By:

Aug 23, 2020 | 7:15 AM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధానపాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రుధిరం రణం). పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తి అయ్యింది

RRR: సారీ చెప్పిన అలియా.. రేస్‌లో మరో నటి!
Follow us on

RRR movie news: ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధానపాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రుధిరం రణం). పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తి అయ్యింది. కరోనా నేపథ్యంలో సినిమా చిత్రీకరణలకు బ్రేక్ పడటంతో.. ఆర్‌ఆర్ఆర్ టీమ్ ఇంట్లోనే ఉండిపోవాల్సి ఉంది. ఇక నిదానంగా సినిమా వారు సెట్స్ మీదకు వెళుతుండగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ని సెప్టెంబర్‌లో ప్రారంభించాలని జక్కన్న అనుకుంటున్నారట. అయితే ఈ మధ్యలోనే రాజమౌళికి అలియా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుశాంత్ మృతి తరువాత అలియాపై నెగిటివిటీ పెరిగినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమెను తీసేందుకు జక్కన్న ఏ మాత్రం ఇష్టపడలేదట. కానీ డేట్లు క్లాష్ అవుతుండటంతో, ఆర్‌ఆర్ఆర్ నుంచి తాను తప్పుకుంటానని ఆమె చెప్పిందట. ఇక అలియా నిర్ణయానికి జక్కన్న టీమ్‌ కూడా ఒప్పుకున్నట్లు టాక్‌. దీంతో చెర్రీ కోసం మరో బాలీవుడ్‌ నటిని వెతికే పనిలో టీమ్‌ పడ్డారట. ఈ క్రమంలో చెర్రీ, ప్రియాంక చోప్రా పేరును సూచించారట. జంజీర్‌(తెలుగులో తుఫాన్‌) మూవీలో చెర్రీ, ప్రియాంక కలిసి నటించగా.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో ప్రియాంక పేరును సూచించగా.. అందుకు జక్కన్న కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే చెర్రీతో ప్రియాంక మరోసారి రొమాన్స్ చేయనుంది.

Read More:

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

నల్గొండలో నవ్య ఆస్పత్రి సీజ్..