అక్కినేని నట వారసత్వం, హాలీవుడ్ హీరోలను తలదన్నే అందం. ఇవన్నీ ఉన్నా.. అఖిల్కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదని చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ కూడా డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను నిరాశకు గురి చేసింది.
దీంతో అఖిల్ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈసారైనా అఖిల్ హిట్ కొడతాడా అన్న క్యూరియాసిటీ పెరిగింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ సాలిడ్ హిట్తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అఖిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రెండు కొత్త చిత్రాలను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు అఖిల్.
వీటిలో ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మరో చిత్రాన్ని సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీ కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సరికొత్త కథాంశంతో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ను అనుకుంటున్నారని తెలుస్తోంది. తిరుపతి నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. కాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కే మూవీ కూడా పిరియాడిక్ నేపథ్యంలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..